మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు 

 
– నాగులమ్మ నుంచి కాటారం వరకు 
– వందలాది ద్విచక్ర వాహనాలతో  భారీగా ర్యాలీ
నవ తెలంగాణ –  మల్హర్ రావు
తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ కాంగ్రెస్ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎన్నికైన తర్వాత మొదటిసారిగా మండలానికి విచ్చేసిన సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు,యూత్ నాయకులు,మహిళ నాయకురాళ్లు  ఘన స్వాగతం పలికారు.  మండలంలోని నాగులమ్మ నుంచి కొయ్యుర్, గంగారాం ఎక్స్ రొడ్డు మీదుగా కాటారం వరకు వందలాది ద్విచక్ర వాహనాలతో భారీగా ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు,ఎంపిటిసి ఏనుగు నాగరాని లక్ష్మీ నారాయణ,సింగిల్ విండో డైరెక్టర్లు ఇప్ప మొoడయ్య,వొన్న తిరుపతి రావు,బొమ్మ రమేష్ రెడ్డి,సంగ్గెం రమేష్,యూత్ అధ్యక్షుడు గడ్డం క్రాoతి, ప్రధాన కార్యదర్శి వేల్పుల రవి, మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు కొండ రాజమ్మ,జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ జంగిడి శ్రీనివాస్, జంగిడి సమ్మయ్య,భోగే మల్లయ్య,కేశారపు చెంద్రయ్య,ప్రభాకర్,రాజ సమ్మయ్య పాల్గొన్నారు.
Spread the love