రాజకీయ శిక్షణా తరగతులను జయప్రదం చేయండి..

నవతెలంగాణ – మునుగోడు
ఈనెల 19 20 21 తేదీల్లో హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే సీపీఐ(ఎం) రాజకీయ శిక్షణ తరగతులను జిల్లా, మండల కమిటీ సభ్యులు, ప్రజాసంఘాల జిల్లా ప్రాక్షన్ కమిటీ సభ్యులు హాజరై విజయవంతం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం కోరారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన మండల కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు నిర్వహించాల్సిన పోరాటాలకు ఈ శిక్షణ తరగతులు ఎంతో దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మునుగోడు సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మిర్యాల భరత్, సహాయ కార్యదర్శి వరికుప్పల ముత్యాలు, మండల కమిటీ సభ్యులు యాసరాణి శ్రీను, వేముల లింగస్వామి, సాగర్ల మల్లేష్, వీరమల్లు , కొంక రాజయ్య, ఎట్టయ్య లింగస్వామి తదితరులు ఉన్నారు.
Spread the love