పలు బాధిత కుటుంబాలకు పరామర్శ

నవతెలంగాణ- యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట మండలం రామాజీపేట, శనివారం, రామాజీపేట కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కుండే సిద్ధులు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా అతడిని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరామర్శించారు. అనంతరం అదే గ్రామానికి చెందిన బీర్ల రాములు అత్తమ్మ పోచమ్మ మృతి చెందగా ఆమె కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేసి కుటుంబానికి ఎండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love