విద్యుదాఘాతంతో ఆవు మృతి..

నవతెలంగాణ – రాయపర్తి
మండల పరిధిలోని కొండూరు గ్రామ శివారులో ఆదివారం విద్యుదాఘాతానికి గురై ఆవు మృతి చెందినట్లు బాధితుడు మారాబోయిన కుమార్ తెలిపారు. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం తన ఆవులను మేపుకురావడానికి గ్రామ శివారు వ్యవసాయ పొలానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తున విద్యుత్‌ ట్రాన్స్‌ ఫార్మర్‌ దగ్గర ఆవు విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు ఆయన పేర్కొన్నారు. ఆవు విలువ సుమారు 48వేల రూపాయలు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని వేడుకున్నారు.

Spread the love