కెసిఆర్ బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించిన సిపి

నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్:
హుస్నాబాద్ లో ఈనెల 15న జరగనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభ స్థలాన్ని సిద్దిపేట సిపి శ్వేతా రెడ్డి పరిశీలించారు. హుస్నాబాద్ పట్టణంలోని సబ్ స్టేషన్ పక్కన సభ ఏర్పాటు పనులు, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లను హుస్నాబాద్ ఏసీపి సతీష్ తో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్ బి ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి, హుస్నాబాద్ సిఐ ఎర్రల కిరణ్, హుస్నాబాద్ ఎస్సై తోట మహేష్, అక్కన్నపేట ఎస్సై తాండ్ర వివేక్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love