స్వాములకు బీక్ష నిర్వహిస్తున్న గ్రామ సర్పంచ్ పర్శారాములు

నవతెలంగాణ – దుబ్బాక రూరల్
హనుమాన్ అనుగ్రహంతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని పద్మనాభుని పల్లి సర్పంచ్ కండ్లకోయ పరశురాములు అన్నారు శుక్రవారం దుబ్బాక మండల పరిధిలోని పద్మనాభునిపల్లి గ్రామంలో హనుమాన్ స్వాములకు సర్పంచ్ భిక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ మాలాధారణ వేసిన స్వాములు పాల్గొని బిక్షను స్వీకరించారు ఈ సందర్భంగా సర్పంచ్ పరశురాములు మాట్లాడుతూ.. హనుమంతుని కరుణాకటాక్షాలతో గ్రామ ప్రజలతో బాగుండాలని ఆకాంక్షించారు. హనుమాన్ స్వరూపులైన ఈ స్వాములకు భిక్ష కార్యక్రమం నిర్వహించడం సంతోషకరంగా ఉందని సర్పంచ్ తెలిపారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్త వేముల శ్రీనివాస్, స్వాములు కరుణాకర్, కనకయ్య, అజయ్, మహేందర్, నవీన్ , తదితరులు ఉన్నారు.

 

Spread the love