నవతెలంగాణ – లఖ్నవూ: ఐపీఎల్-17లో భాగంగా ముంబయి, లఖ్నవూ జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. టాస్ గెలిచిన లఖ్నవూ బౌలింగ్ ఎంచుకుంది. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు చెరో 9 మ్యాచ్లు ఆడగా.. లఖ్నవూ 5 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ముంబయి మూడింట గెలుపొందింది.
ముంబయి జట్టు: ఇషాన్, రోహిత్, సూర్య, తిలక్ వర్మ, హార్దిక్, నెహాల్, టిమ్ డేవిడ్, నబీ, కొయెట్జీ, పీయూష్, బుమ్రా.
లఖ్నవూ టీమ్: రాహుల్, స్టాయినిస్, హుడా, పూరన్, టర్నర్, బదోని, కృనాల్, బిష్ణోయ్, నవీనుల్, మోసిన్, మయాంక్.