ఇద్దరు కూలీల మధ్య గొడవ..ఒకరు మృతి..

నవతెలంగాణ – వేములవాడ 
వేములవాడ – చెక్కపల్లి రహదారిలోని వేములవాడ రూరల్ ఎంపీపీ బండ మల్లేశం వ్యవసాయ మామిడి తోటలో గత కొన్ని రోజులుగా పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరగగా అందులో  ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హృదయ విదారక ఘటన మంగళవారం చోటుచేసుకుంది. డీఎస్పీ నాగేంద్ర చారి, పట్టణ సీఐ వీరప్రసాద్ లు తెలిపిన వివరాల ప్రకారం హత్య జరిగిన సంఘటన స్థలం కు చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సోమవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరగగా ఆనందం, రాజయ్య లు తాగిన మైకంలో ఇద్దరి మధ్య మాటలు పెరిగి గొడవకు దారితీసింది. కోపంతో ఆనందం,జూలపల్లి మండలం తేలుకుంట గ్రామానికి చెందిన మర్రిపల్లి రాజయ్య (64)ను పదునైన ఇనుప పారతో బలంగా తలపై బాధడంతో రాజయ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుని కుమారుడు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లుగా పట్టణ సీఐ వీరప్రసాద్ తెలిపారు వారి వెంట ఎస్సై అంజయ్య, ఎల్లా గౌడ్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
Spread the love