ప్రజల మనిషి ఎండీ జాహంగీర్ ను మెజార్టీతో గెలిపించండి: సీపీఐ(ఎం)

– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నరసింహులు
– సీపీఐ(ఎం) నాయకుల ఇంటింటి ప్రచారం
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
యాదగిరిగుట్టమండలం కాచారం ఆదివారం, సీపీఐ(ఎం) నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నరసింహులు మాట్లాడుతూ.. ప్రజల పక్షాన పోరాడే సీపీఐ(ఎం) భువనగిరి అభ్యర్థి ఎండి జాహంగిర్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. మతోన్మాద బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించాలని 10 సంవత్సరాల కాలంలో కార్మికులకు, కష్టజీవులకు, కర్షకులకు, నిరుద్యోగులకు ఏమి చేయలేదని హామీలు ఇచ్చి మాట తప్పి మళ్లీ మతం పేరుతో కులాల పేరుతో విభజన చేస్తూ దేశాన్ని కార్పొరేట్ శక్తులకు దోచి  పెడుతున్న మతోన్మాద బీజేపీని ఓడించాలని బీజేపీ పాలిత రాష్ట్రాలలో అమానుషంగా మహిళలపై హత్యలు అత్యాచారాలు చేస్తున్న బీజేపీని ఓడించాలని  ఆయన అన్నారు. ప్రజల గొంతుక పార్లమెంట్లో వినిపించాలంటే ప్రజా సమస్యలను పరిష్కారం కావాలంటే ప్రాజెక్టుల కోసం రైతుకు గిట్టుబాటు ధర కోసం కార్మికుల వేతనాల కోసం పోరాటం చేసే ఎండి జహంగీర్  ని గెలిపించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బబ్బూరి పోశెట్టి, నాయకులు వంటేరు పెంటారెడ్డి, నేలపట్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love