నాన్న నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు: ఎంపీ అర్వింద్‌

నవతెలంగాణ – హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్‌  కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డీఎస్‌.. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ భావోద్వేగానికి లోనయ్యారు. నాన్న నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు.. ఎప్పటికీ నాలోనే ఉంటావంటూ ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు.
‘అన్నా.. అంటే నేనున్నా అని.. ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇక లేరు. ఐ విల్‌ మిస్‌ యూ డాడీ!.. నా తండ్రి, నా గురువు అన్నీ మా నాన్నే. ఎదురొడ్డు, పోరాడు, భయపడకు అని నేర్పింది మా నాన్నే. ప్రజలను ప్రేమించు, ప్రజల కొరకే జీవించు అని చెప్పింది మా నాన్నే. నాన్నా..! నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు. ఎప్పటికీ నా లోనే ఉంటావు’ అంటూ పోస్ట్‌ చేశారు.

Spread the love