దళిత,గిరిజన యువత ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలి 

–  జిల్లా ఉపాధి కల్పనా అధికారి విజేత
నవతెలంగాణ – అశ్వారావుపేట
దళిత,గిరిజన యువతి యువకులు ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి అని ఉపాధి కల్పన జిల్లా అధికారి విజేత అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ప్రొడక్టివిటీ కౌన్సిల్ చే నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో దళిత,గిరిజన‌ యువతీ యువకులకు,ఔత్సాహిక మహిళలకు స్థానిక లహరి గ్రాండ్ లో శుక్రవారం శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి గా  జిల్లా ఉపాధి కల్పన అధికారి విజేత మాట్లాడుతూ యువత ఉపాధి అవకాశాల్ని అందుకోవాలని ఇలాంటి నైపుణ్య శిక్షణ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఏ.పీ.పీ.సీ కో ఆర్డినేటర్ సత్యం, శిక్షణ నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ అనంతరం ఉపాధి కల్పన అధికారి విజేత శిక్షణార్ధులకు ధ్రువీకరణ పత్రాలు అందచేసారు.
Spread the love