ఓడేడులో ఏల్పమ్మ వేడుకలు..

నవతెలంగాణ – ముత్తారం
ముత్తారం మండలంలోని ఓడేడు గ్రామంలో గిరిజన కులస్తుల ఆధ్వర్యంలో గురువారం ఏల్పమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా గిరిజన కుల పెద్దలు పొలం పోశాలు, పొలo గట్టయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రోణి కార్తె ప్రారంభం శుభ సందర్భంగా ఆనవాయితీ పకారం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దేవుని ప్రార్థిస్తూ మొక్కులు చెల్లించుకుంటామని, ఆనవాయితీ ప్రకారం గిరిజన కులస్తులందరూ కలిసి ఒకే చోట ఏల్పమ్మ గుడి వద్ద మేకలను బలిచ్చి వేడుకలను జరుపుకొని వనభోజనాల నిర్వహించుకొని వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జంగ మొండయ్య, పొలం చిరంజీవి, పొలo లక్ష్మియ్య, తోట దివాకర్, బొడ్డు గట్టయ్య, కూన రాజేందర్, పొలం రాజయ్య, బొమ్మిడి మల్లేష్, పొలం నర్సయ్య, సుమన్, తిరుపతి, పొలం స్వామి, సతీష్, సంతోష్ తదితరులున్నారు.
Spread the love