ప్రజారోగ్యంతో చెలగాటం

– మినరలా…జనరలా…
– నిబంధనలు పాటించని తాగునీటి శుద్ధి ప్లాంట్లు నిర్వాహకులు
– పుట్టగొడుగుల్లా వాటర్‌ ప్లాంట్లు
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు సబ్‌ డివిజన్‌లో వాటర్‌ ప్లాంట్‌ల నుండి అమ్మే మంచినీరు మినరలా…జనరల్‌ వాటరా అనే విధంగా తలపిస్తున్నాయి. బోర్ల నుండి తీసిన వాటర్‌ని, లేదా మిషన్‌ భగీరథ నీటిని మినరల్‌ వాటర్‌గా అమ్ముతున్నారని సమాచారం. పారిశ్రామికంగా రోజురోజుకు అభివృద్ధి అవుతున్న మణుగూరు పరిసర ప్రాంతాలలో, సబ్‌ డివిజన్‌ పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు మండలాల్లో పుట్టగొడుగుల వాటర్‌ ప్లాంట్లు నిర్వహిస్తున్నారు. వాటర్‌ శుద్ధి ప్లాంట్‌ నుంచి కొనుగోలు చేస్తున్న తాగునీటి వినియోగం నేడు సర్వసాధారణమైంది. ఆరోగ్య రక్షణ దృశ్య ప్రజల తమ దైనందిన జీవితంలో దీన్ని భాగంగా చేసుకుంటున్నారు. దాదాపు ప్రతి పల్లెలో కూడా ప్లాంట్‌ వెలిశాయి. కొన్నిచోట్ల నీటితోపాటు అనారోగ్యాన్ని కొనుక్కొని వస్తున్నామని విషయాన్ని ప్రజలు గ్రహించడం లేదు. మండలంలో కొందరు నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా ప్రజారోగ్యంతో చెలగాట మాడుతున్నారు. వేసవిలో మంచి నీటి వినియోగం ఎక్కువగా ఉండడంతో మణుగూరు పరిసర ప్రాంతాల్లో ప్రస్తుత నీటి వ్యాపారం జోరుగా సాగుతుంది. డబ్బాను పట్టణం, పల్లెల్లో రూ.10 నుంచి 15 వరకు విక్రయిస్తున్నారు. మణుగూరులో సుమారు 25కు పైగా మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌లు ఉన్నాయి. వీటిల్లో చాలా వాటికి అనుమతులు లేవు గతంలో నిర్వాహకులే ఇంటింటికి క్యాన్లు సరఫరా చేసేవారు అలవాటు పడిన తర్వాత చాలాచోట్ల ప్రజలే ప్లాంట్ల వద్దకు వెళ్లి మంచినీరును తీసుకొచ్చుకుంటున్నారు. తాగునీటి సిద్ది ప్లాంట్‌ నిర్వాహకులు శుద్ధ జలం ప్లాంట్లు ఏర్పాటుకు బీఐఎస్‌ (బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌) అనుమతి తప్పనిసరి క్రమబద్ధీకరించుకోవాలి. ప్లాంట్‌ ఏర్పాటు కోసం పక్కా భవనం ఉండాలి. ఎటు చూసినా 15 అడుగుల వైశాల్యంతో విశాల గది ఏర్పాటు చేసుకోవాలి. నిత్యం గోరువెచ్చని నీటితో క్యాన్లను శుభ్రం చేయాలి. నీటిని నింపేందుకు శుద్ధికి వేరువేరు యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలి. శుద్ధి కోసం రసాయనాలు మోతాదుని కలిపేందుకు రెండు ప్రయోగశాలలో తప్పనిసరి ఇందులో రసాయన శాస్త్రం, మైక్రో బయాలజీలో పీజీ పూర్తి చేసిన ఇద్దరు నిపుణులు నియమించాలి. ప్రత్యేక రిజిస్టర్‌ నిర్వహిస్తూ అందులో నీటి పరీక్ష వివరాలు పొందపరచాలి. ఆరు నెలలకోసారి ప్రయోగశాలలో శుద్ధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి. కానీ జిల్లాలో వేళ్ళ మీద లెక్కించగలిగే సంఖ్యలో ప్లాంట్లకే బిఎస్‌ఐ అనుమతులు ఉన్నాయి. చాలా చోట్ల ఒకే గదిలో ప్లాంట్‌ నిర్వహిస్తున్నారు. మండలంలో ఎక్కడ కూడా గోరువెచ్చనిటిని శుభ్రతకు ఉపయోగించడం లేదు. ఫిల్లింగ్‌ ప్యూరిఫైడ్‌కు అన్నిచోట్ల రెండు ట్యాంకులు ఉన్నాయి. ప్రయోగశాల నిపుణుల మాట నుంచి చేతికి అందినంత పరిమాణంలో రసాయనాలు కలుపుతున్నారు. రిజిస్టర్లు నిర్వహణ ఎక్కడా అమలు కావడం లేదు. పర్యవేక్షణ కొరడంటంతో ఆరు నెలలకు ఒకసారి పరీక్షలు జాడే కరువైంది.

మినరల్‌ వాటర్‌ తాగితే ఒళ్ళు, కీళ్ల నొప్పులు
గృహిణి కొండ్రు గౌరీ
మణుగూరులో ఉన్న వాటర్‌ ప్లాంట్‌ మంచినీరు తాగినట్లయితే అనారోగ్యాల పాలవుతున్నారు. ఒళ్ళు, నొప్పులు కీళ్ల బాధలు ఏర్పడుతున్నాయి. కొన్ని సందర్భాలలో కూర్చొని లేవలేని పరిస్థితి ఏర్పడుతుంది. మినరల్‌ వాటర్‌ కాకుండా బోర్‌ వాటర్‌ వాడుతున్నాము. ఎలాంటి ఇబ్బందులు లేవు.

Spread the love