ఆత్మీయుడు సర్పంచ్ బాపు రెడ్డి..

– వర్థంతి సభలో సర్పంచ్ ముక్కీస తిరుపతి రెడ్డి

– బాపు రెడ్డికి గ్రామస్తుల ఘన నివాళులు 
నవతెలంగాణ-బెజ్జంకి 
కుల, మత, వర్గ బేధం లేకుండా అందరిని అప్యాతగా పలకరిస్తూ గ్రామ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుని..తనదైన శైలిలో గ్రామాభివృద్ధిలో కీలకపాత్ర పోషించి తన చేరగని ముద్రను వేసి సర్పంచ్ పెండ్యాల బాపు రెడ్డి అందరికి ఆత్మీయుడిగా నిలిచారని సర్పంచ్ ముక్కీస తిరుపతి రెడ్డి కొనియాడారు. మంగళవారం మండల పరిధిలోని లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీ కార్యలయంలో సర్పంచ్ బాపు రెడ్డి ప్రథమ వర్థంతి సభ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీటీసీ ముక్కీస పద్మ,పంచాయతీ పాలకవర్గం సభ్యులు, పారిశుధ్య కార్మికులు,గ్రామస్తులు బాపు రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాలర్పించారు.
Spread the love