గుర్తు తెలియని వ్యక్తి మృతి

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందారని సీఐ రమేష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం, యాదగిరిగుట్ట పట్టణం లోని  సబ్ రిజిస్టర్ ఆఫీస్ సమీపంలో సాయంత్రం 6:30  సమయంలో గుర్తుతెలియని వ్యక్తి స్పృహ తప్పి పడిపోయి ఉండగా విధుల్లో ఉన్న రంగారావు హెడ్ కానిస్టేబుల్ గమనించి 108 కు ఫోన్ చేసి భువనగిరి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇట్టి వ్యక్తికి చికిత్స అందిస్తుండగా సుమారు రాత్రి 09:30 సమయంలో మరణించాడు. శివ పరీక్ష నిమిత్తం ఇట్టి మృతదేహాన్ని భువనగిరి జిల్లా ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. ఇట్టి వ్యక్తికి సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ 8712662806 కి ఫోన్ చేసి సమాచారం తెలుపగలరు.
Spread the love