నవతెలంగాణ-తాండూర్
బీజేపీ పాలనలో రాజ్యాంగం విధ్వంసం చేసేందుకు కట్ర జరుగుతోందని బెల్లంపల్లి సీపీఐ నాయకులు రేగుంట చంద్రశేఖర్ అన్నారు. బుధవారం తాండూర్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీకి మద్దతిస్తే రాజ్యాంగాన్ని విధ్వంసం చేసి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రిజర్వేషన్లను తొలగిస్తారని తెలిపారు. బీజేపీి పాలనలో రైతు చట్టాల కోసం రైతులు ఉద్యమిస్తే వారిని ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం రెండు కోట్ల ఉద్యోగలు ఇస్తామని వాగ్దానం చేసి యువతను మోసం చేసిందన్నారు. ఇండియా కూటమి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా బీజేపీ పాలనలో రాజకీయ విధ్వంసం పుస్తకాన్ని సీపీఐ నాయకులు విడుదల చేశారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, ఈ సమావేశంలో మండల కార్యదర్శి బయ్య మొగిలి, సీపీఐ నాయకులు పట్టి శంకర్, సముద్రాల ఆనంద్, మలిశెట్టి సత్యనారాయణ, వాసాల నాగరాజు, కామెర దుర్గయ్య, కామెర రమేష్, ఎడ్ల బాపు, కమ్మరి చంద్రయ్య పాల్గొన్నారు.