మంత్రి శ్రీధర్ బాబు ఊరికి వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి

నవతెలంగాణ – మహదేవపూర్
మంథని నియోజక వర్గములోని కాటారం మండలం ధన్వాడ గ్రామములో శ్రీ దత్తాత్రేయ, శివపార్వతి, గణపతి,  ఆదిత్య నందికేశ్వర భక్తాంజనేయ ఆలయ 3వ వార్షికోత్సవ కార్యక్రమానికి  తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విచ్చేశారు. ఈ సందర్భంగా భట్టి కి దుద్దిల్ల శ్రీను బాబు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ఐ టీ మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు స్వగ్రామం ధన్వాడ లో దత్త గుడి వార్షికోత్సవం వేడుకలకు భట్టి హాజరయ్యారు. మంథని నియోజకవర్గ  కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంథని నియోజకవర్గానికి  విచ్చేసిన డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క కి శాలువాతో సత్కరించి శ్రీను బాబు ఘన స్వాగతం పలికారు.  మంథని నియోజకవర్గ కాంగ్రెస్  పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎం, ఎంఎల్ఏ లకు మంత్రి శ్రీధర్ బాబు శేషవస్త్ర సన్మానం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దన్వాడలో శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్  అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు విజయరమణ రావు, మక్కాన్ సింగ్, ప్రేమ్ సాగర్ రావు, గండ్ర సత్యనారాయణ దర్శించుకున్నారు. శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయ 3వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యేలను స్వామి వారి శేష వస్త్రాలతో మంత్రి శ్రీధర్ బాబు సన్మానించారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేశారు. మంథని నియోజకవర్గం లోని అన్ని మండలాల నుండి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love