కాంగ్రెస్ తోనే అభివృద్ధి 

నవతెలంగాణ- నసురుల్లాబాద్: తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నసురుల్లాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నందు పటేల్ అన్నారు. మంగళవారం నసురుల్లాబాద్ మండలంలోని సంగెం గ్రామంలో బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సంగెం గ్రామంలో కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరిగి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని ఆదరించి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు నందు పటేల్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వస్తుందని సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటి పథకాలను అమలు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.  తెలంగాణలో కాంగ్రెస్‌ అదికారంలోకి వస్తుందని అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. బాన్సువాడ నియోజవర్గంలో అత్యధికంగా మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో చందు, శివప్రసాద్, సునీల్ రాథోడ్, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
Spread the love