ఇరుముడి కట్టిన ఆంజనేయ స్వామి భక్తులు 

నవతెలంగాణ – నెల్లికుదురు 

మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్ల గ్రామంలో ఆంజనేయస్వామి కఠోరమైన దీక్షలు 21 రోజు నిర్వహించి ఇరుముడి కట్టి శనివారం కొండగట్టు ఆంజనేయస్వామి వద్దకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా భక్తులు గ్రామంలోని మెయిన్ వీధుల గుండా వెళ్తున్న గ్రామంలో గ్రామ భక్తులు వారి కాళ్ల వద్ద నీళ్ళు పోసుకుంటూ నూతన కోరికలు కోరుకుంటూ భక్తజనులతో కలిసి బ్యాండ్ మేళాలతో కలిసి ఘనంగా ఊరేగించుకుంటూ వెళ్లారు. వారు 21 రోజు భక్తిశ్రద్ధలతో వారి కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించి నేడు ఇరుముడి కట్టుకొని కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలో దేవాలయం వద్ద వారుముక్కిన మొక్కులు చెల్లించుకుంటూ నూతన కోరికలను కోరుకున్నారు. విధంగా గ్రామంలో ఒక పండుగ వాతావరణ నెలకొన్నది గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో వారిని పంపే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయ స్వామి భక్తులు పాల్గొన్నారు.
Spread the love