అయోధ్య రామయ్య దర్శనానికి  భక్తులు

– రాపాక ప్రశాంత్ ఆధ్వర్యంలో తరలిన భక్తజనం
నవతెలంగాణ – రాయపర్తి
అయోధ్య రామయ్య దర్శనానికి రాపాక ప్రశాంత్ ఆధ్వర్యంలో భక్తజనం తరలి వెళ్లారు. రావయ్య దర్శనానికి బయలుచేరిన సందర్భంగా స్థానిక శ్రీ రామ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రశాంత్ మాట్లాడుతూ అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి దర్శనంతో జన్మ దాన్యమవుతుంది అన్నారు. యుగయుగాలకు తరతరాలకు ఆదర్శ పురుషుడైన అయోధ్య రామయ్య దర్శనం జీవితంలో ఓ సువర్ణ అధ్యాయం అన్నారు. సిద్ధాంతపరమైన మహానుభావుడు బాల రాముడి దర్శన ప్రయాణంలో మనసు తన్మయత్వం చెందుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు  శ్రీనివాస్, రాజేందర్, సందీప్, వెంకన్న, రాములు, బ్రహ్మచారి, నాగయ్య, యాకుబ్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love