రిజర్వేషన్ తో ప్రయాణికుల ఇక్కట్లు

నవతెలంగాణ-  హుస్నాబాద్ రూరల్

హైదరాబాదు జేబీఎస్ నుండి హుస్నాబాద్ కు ఆర్టీసీ బస్సులో వచ్చే ప్రయాణికులకు రిజర్వేషన్ తో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. హుస్నాబాద్ కి వెళ్లే  సూపర్ లగ్జరీ బస్ 5:15 కు బస్టాండ్ కు రావడంతో హుస్నాబాద్ వెళ్లే ప్రయాణికులు ఎక్కరు. బస్సులో 6 సీట్లు తప్ప మిగతావన్నీ ఆన్లైన్ రిజర్వేషన్ చేశారనీ బస్సును పక్కన పెట్టారు. 6 గంటలకు జేబీఎస్ నుంచి బయలుదేరారు బస్సు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికుల కోసం  పక్కన పెట్టడంపై ప్రయాణికులు అసంతృప్తి చేశారు. దీంతో హుస్నాబాద్ కి వెళ్లాల్సిన ప్రయాణికులు సిద్దిపేట, కరీంనగర్ బస్సులలో వెళ్లారు. పండగ పూట ప్రయాణికులు  చాలా మంది బస్సుల కోసం వేచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Spread the love