కార్తీక మాసంలో దీపారాధన, వనభోజనాలు

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లి గ్రామంలో వంగపల్లి మోటకొండూర్ రోడ్డులో శ్రీలక్ష్మి నివాస్ ఇన్ఫ్రా డెవలపర్స్, శ్రీ లక్ష్మీ మెడోస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ చల్ల ఉపేందర్ రెడ్డి, డైరెక్టర్స్ ఆధ్వర్యంలో ఆదివారం, కార్తీక మాసం లో దీపారాధన, వనభోజనాలు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కస్టమర్స్ ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు. మేనేజింగ్ డైరెక్టర్ సల్ల ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ యాదగిరిగుట్టకు అతి సమీపంలో అన్ని సదుపాయాలతో అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో విల్లాలు కూడా కట్టే ఆలోచనతో ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ రావుల లక్ష్మన్న, చల్లా కిరణ్ కుమార్ రెడ్డి, పొన్నాల సుధాకర్ రెడ్డి, పవన్, శశికాంత్, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love