కేసీఆర్ జన్మదినం సందర్భంగా పండ్లు పంపిణీ

నవతెలంగాణ – బొమ్మలరామారం
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 70వ జన్మదిన సందర్భంగా బొమ్మలరామారం మండలంలోని శనివారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు.అనంతరం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పండ్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత పది సంవత్సరాల కాల వ్యవధిలో కేసీఆర్ అమలుపరిచిన అనేక సంక్షేమ పథకాలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో మండల విద్యార్థి సంఘం అధ్యక్షులు బాల్ సింగ్ నాయక్ , సోలిపేట గ్రామ శాఖ అధ్యక్షులు ఉడుతల రమేష్ గౌడ్, కంచల తండా టిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు రాజ్ కుమార్ నాయక్, టిఆర్ఎస్ పార్టీ యూత్ మండల జనరల్ సెక్రెటరీ జైపాల్ నాయక్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.

Spread the love