విజేతలను అభినందించిన జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్

నవతెలంగాణ- ఆర్మూర్  

42వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాల బాలికల బాల్ బ్యాట్మెంటన్ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన  జిల్లా బాలుర , బాలికల జట్లను   బాల్ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షులు మానస గణేష్. ప్రధాన కార్యదర్శి శ్యామ్ లు బుధవారం అభినందించారు.  సెప్టెంబర్ 30వ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు పట్టణంలోని లోని ఆల్ ఫోర్స్ నరేంద్ర హై స్కూల్ నందు నిర్వహించిన 42వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలబాలికల బాల్ బ్యాట్మెంటన్ క్రీడా పోటీల యందు బాలుర విభాగంలో విజేతలుగా నిలిచిన నిజాంబాద్ జిల్లా బాలుర జట్టును, బాలికల విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచిన జిల్లా బాలికల జట్టును బాల్ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షులు  మానస గణేష్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శి బి శ్యామ్, కోశాధికారి రాజేశ్వర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణమూర్తి, జాయింట్ సెక్రెటరీ సురేందర్, సంఘ సభ్యులు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love