మేడారం జాతర, మంత్రుల పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

నవతెలంగాణ – తాడ్వాయి 
మేడారం జాతర మంత్రుల పర్యటన ఏర్పాట్లను శనివారం కలెక్టర్ ఇలా త్రిపాఠి వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.మేడారం లో రెవెన్యూ , సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దేవాదాయ ధర్మాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీ రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అమ్మవార్ల గద్దేల ప్రాంగణం, మీడి యా పాయింట్, హరిత హోటల్ , ఆర్టీసీ బస్టాండ్ , పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నా ఏర్పాట్లను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వేణు గోపాల్ , ఆర్డీఓ సత్యపాల్ రెడ్డీ ,  డి పి ఓ వెంకయ్య ఎమ్మార్వో రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love