అనాధ పేద పిల్లలతో దీపావళి సంబరాలు…

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్:చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామంలో వేబర్ హోం అనాధ పిల్లల స్కూల్లో చౌటుప్పల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్.దేవేందర్ పిల్లలతో ఆదివారం టపాకాయలు కలుస్తూ స్వీట్లు తినిపించి దీపావళి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ ఎస్. దేవేందర్ మాట్లాడుతూ అనాధ పిల్లలతో పండగ రోజు వాళ్లతో గడపడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ అనాధ పిల్లలకు చేతనైన సహాయం అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వేబర్ హోం వ్యవస్థాపకులు జ్యోతి కోటేశ్వరరావు,పాఠశాల ప్రిన్సిపాల్ స్టీఫెన్,శైలజ తదితరులు పాల్గొన్నారు

Spread the love