బైక్ పై నుండి పడి వైద్యునికి తీవ్ర గాయాలు

నవతెలంగాణ – తాడ్వాయి
ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో 163 జాతీయ రహదారిపై కాటాపూర్ పిహెచ్సి వైద్యుడు బైక్ పై నుండి పడి తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రంజిత్ గోవిందరావుపేట మండలంలోని ఆయన సొంత నివాసం నుండి, విధుల్లో భాగంగా కాటాపూర్ కు బైక్ పై వెళ్తున్నాడు. పస్రా, తాడ్వాయి ల మధ్య లవ్వాల స్టేజి మూలమలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడిపోయింది. బైక్ పై ఉన్న వైద్యాధికారికి తలకు, ముఖానికి, చెయ్యికి తీవ్ర గాయాలయ్యాయి. కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రంజిత్ వైద్యం పొందుతున్నారు. ఆయనను వైద్య బృందాలు, ప్రాథమిక వైద్య సిబ్బంది  పరామర్శించారు.
Spread the love