నవతెలంగాణ – భగత్ నగర్
తెలంగాణలోనే ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రం,దక్షిణ కాశీగా పేరుగాంచిన వేముల వాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు రూ.10 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు . కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసి ప్రచారంలో భాగంగా తాను దేవస్థానానికి ఉడతా భక్తిగా రూ.10 లక్షల రూపాయలు విరాళాన్ని అందిస్తానని ఇటీవల ప్రకటించారు . ఈ మేరకు గురువారం వేములవాడ దేవస్థానాన్ని కుటుంబ సమేతంగా సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు, ఆలయ సిబ్బంది ఉన్నారు.
తెలంగాణలోనే ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రం,దక్షిణ కాశీగా పేరుగాంచిన వేముల వాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు రూ.10 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు . కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసి ప్రచారంలో భాగంగా తాను దేవస్థానానికి ఉడతా భక్తిగా రూ.10 లక్షల రూపాయలు విరాళాన్ని అందిస్తానని ఇటీవల ప్రకటించారు . ఈ మేరకు గురువారం వేములవాడ దేవస్థానాన్ని కుటుంబ సమేతంగా సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు, ఆలయ సిబ్బంది ఉన్నారు.