లక్ష్మణ్ రాథోడ్ కు డా. ఏపిజే అబ్దుల్ కలామ్ రాష్ట్ర స్థాయి అవార్డు

నవతెలంగాణ – గాంధారి
గ్రామీణ ప్రాంతా విద్యార్థులను నిరంతరం క్రీడా శిక్షణ ఇస్తూ వాలీబాల్, షూటింగ్ బాల్ లో ఎంతో మందిని జాతీయ స్థాయి వరకు రాణించేందుకు కృషి చేస్తున్న పోతంగల్ ఉన్నత పాఠశాల వ్యాయమ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ కు డాక్టర్ ఏ పి జే అబ్దుల్ కలామ్ రాష్ట్ర స్థాయి అవార్డును నిర్మల్ జిల్లాలో మా అమ్మనాన్న ఫౌండేషన్ ఫుడ్ బ్యాంకు వారు అందజేసినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధ్వర్యంలో కొనసాగే వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిరంతరం కొనసాగిస్తూ గ్రామీణ విద్యార్థులకు క్రీడా సౌకర్యాలు కల్పిస్తునారు. దానితో పాటు 2017 సంవత్సరంలో మా అన్న పేరుతో బామన్ నాయక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ 892/2017ను స్థాపించి దాని ద్వారా క్రీడా సదుపాయాలు, క్రీడ దుస్తులు, అందిస్తూ క్రీడా సౌకర్యాలు పల్లెటూరి విద్యార్థులకు అందిస్తున్నందుకు రాష్ట్ర స్థాయి అవార్డు ఇచ్చినట్లు ఆయన తెలిపారు,క్రీడల అభివృద్ధికి గాను గతంలో పలుమార్లుస్వచ్చంద సంస్థలు జాతీయస్థాయి అవార్డులు అందించి నట్లు ఆయన తెలిపారు, ఈ కార్యక్రమం లో మా అమ్మ నాన్న ఫౌండేషన్ (ఫుడ్ బ్యాంకు) వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయులు, శ్రీ సాయి అనాధ ఆశ్రమ వ్యవస్థాపకులు అశోక్ స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Spread the love