అనారోగ్య నివారణకు వ్యక్తిగత శుభ్రత ప్రధానం: డాక్టర్ దీపక్ రెడ్డి

నవతెలంగాణ – అశ్వారావుపేట 
అనారోగ్యాలు నివారణకు వ్యక్తిగత శుభ్రత ప్రధానం అని వినాయక పురం ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ క్రిష్ణ దీపక్ రెడ్డి అన్నారు. ఈ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని దబ్బతోగు లో గురువారం డాక్టర్ క్రిష్ణ దీపక్ రెడ్డి పర్యవేక్షణలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 32 మంది కి సాధారణ,తరుణ చిరు వ్యాధులకు చికిత్స,మందులు అందజేశారు. అనంతరం ఆయన ప్రజలకు ఆరోగ్య సమాచారం అందజేశారు రానున్నది వర్షాకాలం అయినందున వ్యాదుల కాలం గా పరిగణించాలని, కావున ప్రజలు వ్యక్తి గత పరిశుభ్రత,పరిశరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. దోమలు పెరగకుండా చేయడానికి ఇంటి పరిసరాలలో నీటి నిల్వలను లేకుండా చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షకులు శ్రీనివాస్,ఆరోగ్య సిబ్బంది సావిత్రి,రవి ఆశా కార్యకర్త బుల్లెమ్మ పాల్గొన్నారు.
Spread the love