పాతబస్తీ బహదూర్‌పూర్‌లో డ్రగ్స్‌ పట్టివేత..

నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్‌ను డ్రగ్స్ భూతం వదిలేలా కనిపించడం లేదు. ఈ కేసు టీవీ సీరియల్ మాదిరిగా ఏళ్ల తరబడి సాగుతూనే ఉంది. ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు డ్రగ్స్‌తో పట్టుబడుతూనే ఉన్నారు. పాతబస్తీ బహదూర్‌పూర్‌లో డ్రగ్స్‌‌ను అధికారులు పట్టుకున్నారు. బెంగళూరు నుంచి ఎండీఎంఏ డ్రగ్స్‌ తెచ్చి అమ్ముతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. సయ్యద్ అనే వ్యక్తి తన భార్య ఉన్నీసాలేతో కలిసి డ్రగ్స్ అమ్ముతున్నాడు.  నాలుగేళ్లుగా సయ్యద్ దంపతులు డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. రేవ్‌ పార్టీలతో పాటు పబ్బులకు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లతో పాటు ప్రముఖులు వీరి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు. 3 నెలల్లో 19 మంది ప్రముఖులకు సయ్యద్ డ్రగ్స్‌ సరఫరా చేశాడు. ట్రాన్స్‌ఫోర్ట్‌ ద్వారా డ్రగ్స్‌ తీసుకొచ్చి అమ్ముతున్నారు. గతంలోనూ పలుమార్లు సయ్యద్‌ దంపతులు అరెస్ట్ అయ్యారు. సయ్యద్‌ దంపతులతో పాటు మరో నలుగురిని టీఎస్‌ న్యాబ్‌ అరెస్ట్‌ చేసింది.

Spread the love