కోల్కత : ఐసీసీ ప్రపంచకప్లో పాకిస్థాన్, ఇంగ్లాండ్ గ్రూప్ దశలో చివరి మ్యాచ్కు సిద్ధమయ్యాయి. ఇంగ్లాండ్ ఇప్పటికే సెమీఫైనల్ రేసు నుంచి నిష్క్రమించగా.. పాకిస్థాన్ సాంకేతికంగా ఆశలు నిలుపుకుంది. ఈడెన్గార్డెన్స్లో నేడు డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లాండ్ను పాక్ కనీసం 290 పరుగుల తేడాతో ఓడించాలి. లేదంటే, ఇంగ్లాండ్ను 150 పరుగులకు పరిమితం చేసి ఆ లక్ష్యాన్ని 3.4 ఓవర్లలో ఛేదించాలి. అప్పుడే న్యూజిలాండ్ నెట్ రన్రేట్ను పాక్ అధిగమించగలదు. తొలుత బ్యాటింగ్ చేసి 400-450 పరుగులు చేసి, బౌలర్లు అద్భుతం చేస్తేగానీ పాకిస్థాన్కు అవకాశాలు లేవు. మరో మ్యాచ్లో ఆస్ట్రేలియాతో బంగ్లాదేశ్ తలపడనుంది. సెమీస్ ముంగిట మరో విజయంపై ఆసీస్ కన్నేయగా.. విజయంతో వరల్డ్కప్ నుంచి నిష్క్రమించాలని బంగ్లాదేశ్ భావిస్తోంది.