ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం నియోజవర్గ అధ్యక్షుడిగా ఎర్ర శంకర్

నవతెలంగాణ –  మునుగోడు 
మండలంలోని చీకటిమడుగు గ్రామానికి చెందిన ఎర్ర శంకర్ ను  ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం మునుగోడు నియోజకవర్గం అధ్యక్షుడుగా నియమిస్తూ సోమవారం జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ విద్యార్థుల హక్కుల సాధన కోసం నియోజవర్గంలోని ప్రతి గ్రామ గ్రామీణ సంఘమును ఏర్పాటు చేస్తానని తెలిపారు . రాబోయే రోజుల్లో విద్యార్థుల సమస్యలపై విద్యార్థి సమస్యలపై పోరాటం చేస్తానని ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయించే విధంగా  కృషి చేస్తానని అన్నారు.  తమ ఎన్నికకు సహకరించిన  రాష్ట్ర , జిల్లా ,నియోజకవర్గ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఒంగోలు సునీల్ తదితరులు ఉన్నారు.
Spread the love