బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎర్రబెల్లి

నవతెలంగాణ – రాయపర్తి
మండలంలోని కొండూరు గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు పోలినేని శ్యామ్ రావు నానమ్మ లక్ష్మీ, మైలారం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు పోతర్ల సమ్మయ్య తల్లి పోతర్ల ఉత్తరమ్మ  ఇటీవల అనారోగ్యంతో మరణించగా విషయం తెలుసుకున్న రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉండే వ్యక్తులు మరణించడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆయనతోపాటు మండల పార్టీ అధ్యక్షుడు మునవత్ నర్సింహా నాయక్, ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, సర్పంచులు లెతాకుల సుమతి యాదవ రెడ్డి, కర్ర సరిత రవీందర్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, ఉపాధ్యక్షులు గబ్బేట బాబు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
Spread the love