బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎర్రబెల్లి

నవతెలంగాణ – రాయపర్తి
మండలంలోని మైలారం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు రంగు కుమార్ తండ్రి రంగు సాయిలు ఇటీవల అనారోగ్యంతో మరణించగా రాష్ట్ర మాజీ మంత్రి దయాకర్ రావు మంగళవారం దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలు చల్లి నివాళులర్పించారు. తదుపరి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబం ఒక పెద్ద దిక్కును కోల్పోవడం బాధాకరం అన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటా అని హామీ ఇచ్చారు. ఆయనతోపాటు జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, ఎస్టీ సెల్ అధ్యక్షుడు గుగులోత్ జాజు నాయక్, పార్టీ నాయకులు పరుపాటి రవీందర్ రెడ్డి, బాషబోయిన సుధాకర్, సంకినేని ఎల్లస్వామి తదితరులు పాల్గొన్నారు.
Spread the love