ఓటు హక్కు పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి


నవతెలంగాణ భీంగల్: ఓటు హక్కుపై 18 ఏండ్లు నిండిన ప్రతి వ్యక్తికి అవగాహన కల్పించాలని తాహాసిల్దార్ వెంకటరమణ, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చిరంజీవిలు తెలిపారు. గురువారం జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఓటు హక్కు ప్రాధాన్యత పై అవగాహన కల్పించారు. విద్యార్థులు కూడా 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ ధనుంజయ్, కళాశాల లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love