ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి : తాహసిల్దార్ గోవర్ధన్

నవతెలంగాణ – మిరు దొడ్డి
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రెండు రోజులపాటు గ్రామాలలో ఓటర్ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తహసీల్దార్ గోవర్ధన్ తెలిపారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓటర్ లిస్టులో ఏవైనా తప్పులు ఉంటే సరి చేసుకోవచ్చని వెల్లడించారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని 18 సంవత్సరాలు నిండిన యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు ఫారాన్ని నింపి బిఎల్వోలకు అప్పగించాలన్నారు. ఈ కార్యక్రమంలో, ఆర్ ఐ రాజ్ కుమార్, కొండల్ రెడ్డి బిఎల్వోలు రేణుక, పలువురు పాల్గొన్నారు.
Spread the love