ప్రతి ఒక్కరు బ్యాంకు సేవలు వినియోగించుకోవాలి

నవతెలంగాణ- హలియా: పోచంపల్లి బ్యాంకు సేవలో ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి అని  బ్రాంచ్ మేనేజర్ గంజి కుంట్ల యాదగిరి అన్నారు.  దీపావళి సందర్భంగా బ్యాంకులో నిర్వహించిన లక్ష్మీ పూజ అనంతరం మాట్లాడుతూ బ్యాంకు యొక్క అన్ని సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాలు కలిగి ఉండాలని తద్వారా ఖాతా ద్వారా బీమా ఉండడం వలన  అనుకోని పరిణామాలు జరిగినప్పుడు వచ్చే ప్రతిఫలం భవిష్యత్తు తరాలకు ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో బ్యాంకు  సిబ్బందిఅకౌంటెంట్ సతీష్, మోహనా చారి, వెంకన్న, కోటయ్య, షాహన్, సైదులు,బాలు, బ్యాంకు ఆడిటర్ జంగయ్య పాల్గొన్నారు.
Spread the love