నవతెలంగాణ-హైదరాబాద్: పంజాబ్లో అర్ధరాత్రి పేలుళ్లు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో నేషనల్ ఇన్వెస్టగేషన్ ఏజెన్సీ(NIA) దర్యాప్తు ముమ్మరం చేసింది. పేలుళ్లు సంభవించిన ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాల్లో క్లూస్ టీం తనిఖీలు చేపట్టింది. సేకరించిన పలు ఆధారాలను ఫోరెన్సిక్ ల్యాబ్లకు అందజేశారు అధికారులు.
మంగళవారం అర్ధరాత్రి జలంధర్లోని బీఎస్ఎఫ్ హెడ్క్వార్టర్స్ దగ్గర తొలి పేలుడు ఘటన జరిగింది. రాత్రి 8 గంటల సమయంలో బీఎస్ఎఫ్ కార్యాలయం సమీపంలో పార్క్ చేసిన స్కూటర్ పేలింది. ఆ తర్వాత అర్థరాత్రి అమృత్సర్లో మరో పేలుడు ఘటన నమోదు అయ్యింది. ఖాసా రోడ్డులో ఉన్న ఆర్మీ కంటోన్మెంట్ ఏరియా సరిహద్దు గోడ వద్ద పేలుడు జరిగింది.



