- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : శ్రీశైల పుణ్యక్షేత్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రీసత్య సాయి జిల్లా బత్తలపల్లికి చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు వడ్డెర సత్రంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నెల 20న సత్రంలో గది తీసుకున్న వీరు, మూడు రోజులుగా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చూడగా, బాత్రూంలో ముగ్గురు మహిళలు, హాల్లో ఇద్దరు పురుషులు ఉరి వేసుకుని కనిపించారు. మృతులను శ్రీసత్య సాయి జిల్లా బత్తలపల్లికి చెందిన వారిగా గుర్తించారు.
- Advertisement -



