ఈ నెల 13 పెన్షనర్ల కుటుంబ సమ్మేళనం

నవతెలంగాణ – కంటేశ్వర్
తెలంగాణ ఆల్ పెన్షనర్స్& రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ నిజాంబాద్ జిల్లా ఆధ్వర్యంలో మార్చి 13 (బుధవారం) న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పెన్షనర్ల కుటుంబ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా అధ్యక్షులు కే రామ్మోహన్రావు ప్రధాన కార్యదర్శి ఎస్ మదన్ మోహన్ తెలిపారు. ఈ మేరకు శనివారం నిజామాబాద్ నగరంలోని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 13న బసవ గార్డెన్ వినాయక్ నగర్ నందు ఈ కార్యక్రమం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం అవుతుందని, ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు , అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ , జిల్లా ప్రజా పరిషత్ సీఈవో  ఉష తదితరులు హాజరవుతున్నారని  వారు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షులు శాస్త్రుల దత్తాత్రేయ రావు, ఉపాధ్యక్షులు భోజా రావు కోశాధికారి నారాయణ, అసోసియేట్ ప్రెసిడెంట్ సుదర్శన్ రాజు నిజాంబాద్ డివిజన్ అధ్యక్షులు హనుమాన్లు, కార్యదర్శి ప్రసాద్ రావు జిల్లా నాయకులు దీన సుజనా, పూర్ణచంద్రరావు, జ్ఞానేశ్వర్, శంకర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love