పిడుగుపాటుకు రైతు మృతి..

– ప్రభుత్వం ఆదుకోవాలి గ్రామస్తులు విజ్ఞప్తి
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రమాదవశాత్తు పిడుగుపాటుతో నేరేడు కొమ్మ మలహల్ రావు (52) అనే రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని మల్లారం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల,కుటుంబ సభ్యుల పూర్తి కథనం ప్రకారం మలహల్ రావు సాయంత్రం తన పామాయిల్ తోట వద్దకు పశువులు రాకుండా చూస్తానని వెళ్లినట్లుగా తెలిపారు. అయితే అకాల ఈదురు గాలి బీభత్సం తోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం తగ్గింపై, రాత్రైన ఇంటికి రాకపోవడంతో కుటుంబ సబ్యయలు పామాయిల్ తోట వద్దకు వెళ్లి వెతుకుతుండగా తోటలో శవమై కనిపించినట్లుగా కన్నీరుమున్నీరైయ్యారు. చలిపిడుగు వేయడంతో అక్కడికక్కడే చనిపోయినట్లుగా  పేర్కొన్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.కుటుంబ పెద్దదిక్కు కోల్పోవడంతో బాధిత కుటుంభం రోడ్డున పడింది.ఆర్థికంగా మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Spread the love