పేద ముస్లిం యువతి వధువు వివాహానికి ఆర్థిక సహాయం.

నవతెలంగాణ- రాయపోల్
నిరుపేద మైనారిటీ కుటుంబంలో కూతురు వివాహం చేయడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని పేద ముస్లిం యువతి వివాహానికి ఆర్థిక సహాయం జరిగిందని ఆర్టీసీ కండక్టర్, విలేజ్ బస్సు ఆఫీసర్ జయేందర్ రెడ్డి అన్నారు. శనివారం దౌల్తాబాద్ మండలం దొమ్మట గ్రామంలో నిరుపేద ముస్లిం వధువుకు వివాహానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దౌల్తాబాద్ మండలం దొమ్మట గ్రామానికి చెందిన దూదేకుల హామీద్ కూతురు సానియా బేగం వివాహం చేయడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారని, వీరిది పూట పూటకు కాయకష్టం చేసుకుని బతుకులు వెళ్లదీస్తున్న నిరుపేద మైనారిటీ కుటుంబం.అలాంటి దీనస్థితిలో ఒక ఆడబిడ్డ పెళ్లి చేయడం తల్లిదండ్రులకు స్తోమతకు మించి శాపంగా మారిందన్నారు.పొట్టకూటి కోసం హమీద్ చిన్న సైకిల్ పంక్చర్ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటాడు.గత కొద్ది రోజులుగా హమీద్ తీవ్ర అనారోగ్యానికి గురి కావడం, ఒక కిడ్నీ ఫెల్యూర్ కావడంతో కుటుంబ పోషణ భారమైందన్నారు.వీరికి సెంటు భూమి కూడా లేకపోవడం,నివాసం ఉండే పూరి గుడిసె గతంలో ప్రమాదవశత్తు దగ్ధం కావడంతో ఇటీవల కూతురు వివాహం చేయడానికి డబ్బులు లేకపోవడంతో ఐదు నెలల క్రితమే నిశ్చితార్థం జరిగిన, ఆర్థిక స్తోమత లేక పెళ్లి చేయలేకపోయారని ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజాసేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ సమాచారం మేరకు తమ వంతు సహకారంగా 5 వేల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగిందన్నారు.ఇంకా మానవతావాదులు ఎవరైనా నిరుపేద యువతీ వివాహానికి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్, ప్రధాన కార్యదర్శి పుట్ట రాజు, ఆర్టీసీ విలేజ్ బస్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Spread the love