- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు (90) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన నాదెండ్ల మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పార్థివదేహాన్ని జూబ్లీహిల్స్లోని స్వగృహంలో ఉంచనున్నారు. కుటుంబ సభ్యుల సూచన మేరకు, గురువారం మధ్యాహ్నం 4 గంటలకు హైదరాబాద్లోని పంజాగుట్ట హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
- Advertisement -



