డీబీఎఫ్ నేత శంకర్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీమంత్రి హరీష్ రావు 

నవతెలంగాణ – మిరుదొడ్డి 
దళిత బహుజన ఫ్రంట్‌ (డిబిఎఫ్) జాతీయ కార్యదర్శి పి.శంకర్ కుటుంబాన్ని మాజీ మంత్రి  హరిష్ రావు పరామర్శించారు.శంకర్ తండ్రి పెద్దలింగని రాజయ్య మరణించిన  సమాచారం తెలుసుకొని హరిష్ రావు  లింగుపల్లి కి వచ్చి రాజయ్య చిత్రపటానికి నివాళులు అర్పించారు. రాజయ్య మంత్రి మరణం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమం లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎంపి ఆభ్యర్ధి  వెంకట్రామ్ రెడ్డి,  ఎస్సీ,ఎస్టి కమిషన్  మాజీ చైర్మన్  డాక్టర్  ఎర్రోళ్ళ శ్రీనివాస్ ,బిఅర్ ఎస్ నాయకులు మనొహర్ రావు,రాధక్రిష్ణశర్మ,మదాసు శ్రీ నివాస్, మట్టి మనిషి ఫౌండేషన్ చైర్మన్ కుడుదుల పరశురాం, మండల వైస్ యంపిపి రాజులు, పంజాల శ్రీనివాస్ గౌడ్ రాజ మహేందర్ రెడ్డి బాబు రెడ్డి సూకురి లింగం తదితరులు పాల్గొన్నారు.
Spread the love