మోడీ సర్కార్‌పై ట్విటర్ మాజీ సీఈఓ సంచలన వ్యాఖ్యలు..

నవతెలంగాణ-హైదరాబాద్ : మోడీ ప్రభుత్వంపై ట్విటర్ మాజీ సీఈఓ జాక్ డోర్సే సంచలన ఆరోపణలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సంచలన విషయాలు బయటపెట్టారు. ‘రైతుల నిరసనను, ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్న వారి అకౌంట్లను బ్లాక్ చేయమని ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. లేదంటే దేశంలో ట్విటర్ నే బ్లాక్ చేస్తాం, కార్యాలయాలు మూసేస్తామని, ఉద్యోగుల ఇళ్లపై రైడ్స్ చేయిస్తామని (చేశారు కూడా) అన్నారు. భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి’ అని డోర్సే తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

Spread the love