నిరుపేదల ఆపదలో నేనున్నాను అంటున్నా మాజీ జెడ్పిటిసి

నవతెలంగాణ-రామగిరి 
నిరుపేదల ఆపదలో నేనున్నాను అంటూ ఆపద వస్తే ఆదుకోవడం అందరి బాధ్యత అని ముత్తారం మండల మాజీ జెడ్పిటిసి మైదం భారతి వరప్రసాద్ అన్నారు. రామగిరి మండలం ఆదివారంపేట చెందిన నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం ముత్తారం మాజీ జెడ్పీటీసీ మైదం భారతి – వరప్రసాద్ అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు సోమవారం రామగిరి మండలం ఆదివారం పేట గ్రామం చెందిన మజీద్ ముజావర్ రహేనబేగం అనారోగ్యం తో మృతి చెందగా.. వారి కుటుంబ సభ్యులకి 3 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన మాజీ జడ్పీటీసీ మైదం భారతి వరప్రసాద్, ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైదం బుచ్చయ్య, మాజీ ఉపసర్పంచ్ అట్టె తిరుపతి రెడ్డి,  మాజీ ఎంపీటీసీ కన్నూరి నర్సింగరావు, గ్రామ ఎస్సీసెల్ అధ్యక్షులు కన్నూరి శ్రీకాంత్, సీనియర్ నాయకులు చింతల శ్రీనివాస్ రెడ్డి, ఎండి ఇస్మైల్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love