మానవత్వంతో ముందుకు…

– పేదలకు,కళాకారులకు అండగా..
– నేనున్నాను అంటూ భరోసా
నవతెలంగాణ -పెద్దవూర
తెలంగాణ కళా వేదిక దగాపడ్డ ఉద్యమకారులు గోస అనే కళాళారుల కార్యక్రమం నల్గొండ జిల్లా కేంద్రం లోని ఎస్ బీ ఆర్ పంక్షన్ హాల్లో సోమవారం నిర్వహించారు.ఈ సమావేశానికి నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం తిరుమల గిరి సాగర్ మండలం కొంపెల్లి గ్రామానికి చెందిన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి పిలుపు మేరకు హాజరై మానవత్వం తో ముందుకు నడిచి పేదలకు కళాకారులకు అండగా నేనున్నా నంటూ భరోసా కల్పిస్తున్నారు. పాండు రంగారెడ్డి కళాకారులకు ఉచితంగా అన్నదానం చేశారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ కళాకారులు ప్రభుత్వానికి వాళ్ళ డిమాండ్ లను పరిశీలించాలని,ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సాధించుకుందాం అని కళాకారులు సభలో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో బుసిరెడ్డి ఫౌండేషన్ సభ్యులు కళాకారులు పాల్గొన్నారు.

Spread the love