![](https://navatelangana.com/wp-content/uploads/2024/06/IMG-20240624-WA0049-300x169.jpg)
భువనగిరి మండలంలోని వడపర్తి గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రానికి సోమవారం జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిషత్ 15 ఆర్థిక సంఘం నిధుల నుంచి సుమారు 20 లక్షల రూపాయలతో వడపర్తి గ్రామంలో ఆరోగ్య ఉపకేంద్ర భవన నిర్మించనున్నట్లు తెలిపారు. అధికారులు ఈ భవనాన్ని సకాలంలో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్, జడ్పిటిసి సుబ్బురు బీరురు మల్లయ్య, తాజా మాజీ సర్పంచ్ (కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు) ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎంపీటీసీ ఉడుత శారద ఆంజనేయులు యాదవ్, ఎంపీడీవో శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.