నలుగురు ఐదు సెట్ల నామినేషన్

నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల  నియోజకవర్గ శాసనమండలి  ఉప ఎన్నిక స్థానానికి మూడవ రోజైన శనివారం 4 గురు అభ్యర్థులు 5 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నేషనల్ నవ క్రాంతి పార్టీ అభ్యర్థిగా 1 సెట్, స్వతంత్ర అభ్యర్థిగా మరో  సెట్   నామినేషన్ ను   కర్నే రవి దాఖలు చేశారు.స్వతంత్ర అభ్యర్థులుగా  భైరవభట్ల శ్రీనివాసరావు 1 సెట్, బక్క జడ్సన్ 1 సెట్, దైద సోమ సుందర్ 1 సెట్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను నల్గొండ జిల్లా కలెక్టరేట్ లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ములుగు జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి,  సిహెచ్. మహేందర్ జీ కి సమర్పించారు.
Spread the love